Breaking: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ

by srinivas |
Breaking: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి మంగళవారం వెళ్లనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళనున్నారు. ఆయనతో భేటీ అయిన రాష్ట్రానికి సంబందించిన విషయాలపై చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందులు ఉన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఏపీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు హస్తినకు పయనం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.



Next Story