ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్

by Shiva |
ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఇటీవల డీవోపీటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేశారు. ఆదివారం వారికి పోస్టింగ్‌లు ఇస్తూ.. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రభుత్వం నియమించడంతో పాటు ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోలా భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎంఎం.నాయక్‌ను రిలీవ్ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణను నియమించారు. జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed