- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. అక్టోబర్ 20 తర్వాత మరో తుపాను?
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు 500 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకి 600 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడి నెల్లూరు - చెన్నై ల మధ్య అక్టోబర్ 18 తర్వాత తీరందాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావంతో విశాఖ నుంచి చెన్నై - పాండిచ్చేరి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు ప్రస్తుతానికి లేవని తెలిపారు. కానీ.. మరో నాలుగురోజుల పాటు దీనిప్రభావంతో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.
వాయుగుండంగా మారే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అక్టోబర్ 20 తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. వాయుగుండం, ఆ తర్వాత తుపాను.. రైతులపాలిట శాపాలుగా కనిపిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఇప్పుడు తుపానుల పాలవుతుందన్న ఆందోళన రైతన్నల్లో నెలకొంది.