- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > అనంతపురం > తప్పులు బయటపెట్టిన జర్నలిస్ట్కు బెదిరింపులు.. ఎస్పీకి APUWJ ఫిర్యాదు
తప్పులు బయటపెట్టిన జర్నలిస్ట్కు బెదిరింపులు.. ఎస్పీకి APUWJ ఫిర్యాదు
by Disha Web Desk 18 |
X
దిశ ప్రతినిధి,అనంతపురం: జర్నలిస్ట్ మల్లేష్ను కొందరు టీచర్లు బెదిరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని APUWJ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా APUWJ నాయకులు మాట్లాడుతూ..రెండు రోజుల క్రితం అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మల్లేష్ వెళ్లగా అక్కడ పలు అక్రమాలు వెలుగు చూశాయన్నారు. వాటిపై వార్త రాశాడనే నెపంతో కొందరు టీచర్లు సంబంధిత జర్నలిస్టును బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారించి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరామన్నారు. ఇందుకు జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి.. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APUWJ నాయకులు మార్కండేయులు, చౌడప్ప, చలపతి, అక్కులప్ప తో పాటు షఫీ తదితరులు పాల్గొన్నారు.
Next Story