కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే  ఎన్నికల్లో గెలిపిస్తాయి
X

దిశ, సదాశివపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సదాశివపేట పట్టణం ,సదాశివపేట మండలంలోని పెద్దాపూర్, నందికంది ,గొల్లగూడెం ,నిజాంపూర్ , కోల్కూర్,ఆత్మకూర్ ,మద్దికుంటలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో నీలం మధు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. అలాగే అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని

కార్యకర్తలు ముందుకెళ్లి వారిని చైతన్య పర్చాలన్నారు. ఎన్నికలలో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మెదక్ నుంచి ప్రాతినిథ్యం వహించిన దివంగత ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు, కంపెనీలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రశ్నిస్తున్నాయని, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయా పార్టీలు ఏం చేశాయో? చూపాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, భూములు కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి మెదక్ గడ్డను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎవరి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ,మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Next Story

Most Viewed