Breaking: పల్నాడు జిల్లాలో ముగ్గురు దుర్మరణం

by srinivas |
Breaking: పల్నాడు జిల్లాలో ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పిడుగురాళ్లకు చెందిన నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించారు. గురజాలలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed