AP:రుయా ఆసుపత్రి అభివృద్ధికి 90 కోట్లు మంజూరు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-24 16:49:40.0  )
AP:రుయా ఆసుపత్రి అభివృద్ధికి 90 కోట్లు మంజూరు
X

దిశ ప్రతినిధి,తిరుపతి:రాయలసీమ జిల్లాలకు తలమానికమైన తిరుపతి రుయా ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారు. గురువారం తిరుపతికి విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తో కలిసి రుయా ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల వ్యవధిలో రుయా ఆసుపత్రి అభివృద్ధికి 90 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే ప్రాథమికంగా సమస్యలు గుర్తించామని దశల వారిగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రోగుల సౌకర్యార్థం సాయంత్రం వేళలో కూడా ఓపి సేవలను కల్పిస్తున్నామని వివరించారు. అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆసుపత్రి లోని అన్ని విభాగాల వైద్యులు.. వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఓపి సేవలకు హాజరుకావాలని ఇందుకోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్తను తీసుకువస్తున్నామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed