పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం.. ఎమ్మెల్యే రేవూరి

పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-30 17:17 GMT

దిశ, గీసుగొండ : పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని అన్నారు.

గ్రామంలోని చెత్తాచెదారాన్ని, డ్రైనేజీలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రియాజుద్దీన్, ఇంచార్జి ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, మండల వైద్యాధికారి డాక్టర్ దేవేందర్, పల్లె దావఖాన డాక్టర్లు హెల్త్ సూపర్వైజర్ ఎ.కిరణ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, కొమ్ము శ్రీకాంత్, గ్రామ పంచాయితీల కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Similar News