అయాచితం నటేశ్వర శర్మకు 'దాశరథి కృష్ణమాచార్య' అవార్డు..

Update: 2023-07-19 16:40 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా అయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘‘దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు’’ ఈ ఏడాది అయాచితం నటేశ్వర శర్మ ను ఎంపిక చేసినట్టు రాష్ట్ర ప్రభుతం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. కామారెడ్డి జిల్లాకు చెందిన నటేశ్వర శర్మ ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని. ఈ అవార్డుతో పాటు 1 లక్షా 1,116 రూపాయల నగదును, శాలువా, జ్ఞాపికను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీతకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా, ఆయాచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


Similar News