Mutyalamma temple: ముత్యాలమ్మ టెంపుల్ లో కొత్త విగ్రహంపై తలసాని కీలక అప్ డేట్

ముత్యాలమ్మ టెంపుల్ పై తలసాని కీలక అప్ డేట్ ఇచ్చారు.

Update: 2024-10-22 07:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దుండగుల దాడి నేపథ్యంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో త్వరలో నూతన విగ్రహం ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ ఉదయం ఆలయాన్ని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. మూడు రోజుల పాటు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కుంభాభిషేకం కూడా నిర్వహిస్తామన్నారు. పూజారులు, పండితుల సూచన మేరకు ఈ ఆలయంలో శాంతి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆలయంపై దాడి నేపథ్యంలో ఎలాంటి శాంతి స్థాపన, సంప్రోక్షణ కార్యక్రమాలు ఎలా జరపాలనేదానిపై పండితులు, ఆలయ సిబ్బందితో తలసాని చర్చించారు. ఆలయం వద్ద పోలీసుల పికెటింగ్ వల్ల బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల దీపావళి పండగకు అటుఇటుగా వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఆలయం వద్ద తిరిగి యధావిధి వాతావరణం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.


Similar News