తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదా.. కసాయిగా మారిన కన్న తండ్రి..

కన్నతండ్రి కసాయిగా మారి తన కొడుకును కట్టెతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి భార్య, కోడిపాక అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-06-29 14:38 GMT

దిశ, ఎల్లారెడ్డి : కన్నతండ్రి కసాయిగా మారి తన కొడుకును కట్టెతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి భార్య, కోడిపాక అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్సై మహేష్ చేరుకొని పూర్తి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మృతుడి భార్య అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని గండిమాసంపేటకు చెందిన కోడిపాక వెంకటేశంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిలు తండ్రి వెంకటేశం ఆస్తి కోసం కొద్ది రోజులుగా గొడవలు పడుతున్నారని, శనివారం ఉదయం మూడు నుంచి నాలుగు గంటల సమయంలో తండ్రి కొడుకులు ఆస్తికోసం గొడవపడ్డారని తెలిపారు.

తన తండ్రి కొడుకును కట్టెతో కొట్టాడని దాంతో కొడుకు సాయిలు అక్కడికక్కడే స్పృహ తప్పి కోల్పోయాడని తెలిపారు. వెంటనే తండ్రి వెంకటేశం స్పృహ కోల్పోయిన కొడుకు సాయిల్ ను తీసుకెళ్లి ఇంటి పక్కనే ఉన్న కాలువలో పడవేశాడు. కాగా ఉదయం లేచేసరికి బాధితుడు శవమై కాలువలో తేలాడని మృతుడి భార్య అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి వయసు 28 సంవత్సరాలు, మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ తెలిపారు. మృతుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ తెలిపారు. మృతుడి మరణం పట్ల పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేపడతామని సీఐ రవీందర్ తెలిపారు.

Similar News