గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు

Update: 2024-07-01 15:06 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ పట్టణంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు సీఐ కృష్ణ ఆధ్వర్యంలో కొయ్యగుట్టలో తనిఖీలు నిర్వహించగా సీమల శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాంత్ ను విచారించగా బోధన్ పట్టణంలోని రాకాసిపేటకు చెందిన నస్రిన్ బేగం అలియాస్ సుమేరాబాను వద్ద తాను గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో బోధన్ పట్టణంలోని నస్రిన్ బేగం ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 500 గ్రాముల గంజాయి లభించింది. నస్రీన్ తో పాటు ఆమె మామ రషీద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని నాయగావ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. శ్రీకాంత్, నస్రిన్ బేగం, రషీద్ ను సోమవారం అరెస్టు చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ కృష్ణ, సిబ్బందిని ఎస్పీ సింధుశర్మ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

Similar News