'మునుగోడు టికెట్ మాకు ఇవ్వకుంటే అన్ని పార్టీలను ఓడిస్తాం'

Update: 2023-10-11 14:27 GMT

దిశ, నల్లగొండ: మునుగోడు టికెట్ ముదిరాజులకు ఇవ్వకుంటే అన్ని పార్టీలను ఓడిస్తామని మునుగోడు బీఆర్‌ఎస్ నేత నారబోయిన రవి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో చిన్న వెంక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆయన ఆధ్వర్యంలో ముదిరాజు ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు టికెట్‌ను ముదిరాజులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గెలుపు ఓటములను నిర్ణయంచే శక్తి మాకు ఉందని.. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు మునుగొడులో ఎక్కువ ఉన్నాయి కావున ముదిరాజులకు టికెట్టు ఇవ్వాలి అని అన్నారు.

అలాగే 15-10-2023 నాడు మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రతి ముదిరాజ్ బిడ్డ ఈ సభకు రావాలని కోరారు. బీర్ఎస్ పార్టీ అధిష్టానం సమాలోచన చేసి ముదిరాజులకు టికెట్లు ఇవ్వాలి అన్నారు. ముదిరాజులను గుర్తించని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘ నాయకులు సోమా మల్లయ్య, కేషబోయేనా శంకర్, కావాలి ఆంజనేయులు, తోకల వెంకన్న, బొల్లా వెంకట్, గంట సత్తి, మేపా అధ్యక్షులు కట్ల సైదులు ముదిరాజ్, భారత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News