యాదగిరిగుట్ట నల్ల చెరువులో మృతదేహం కలకలం

యాదగిరిగుట్టలోని నల్ల చెరువులో సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం‌ లభ్యమైనట్లు యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు.

Update: 2024-10-07 08:18 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్టలోని నల్ల చెరువులో సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం‌ లభ్యమైనట్లు యాదగిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చెరువు దగ్గరకు వెళ్లి శవాన్ని బయటికి తీయించినట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని మగ వ్యక్తిగా గుర్తించినట్లు, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్లు చెప్పారు. వయసు 40 నుంచి 45 సంవత్సరాల వరకు ఉండవచ్చని, మోహం ఉబ్బిపోయిన స్థితిలో ఉండి గుర్తుపట్టలేనంతగా ఉందని, శరీరంపై కేవలం నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. ఎడమ చేతిపై ఎంఎల్ఏ అనే పచ్చబొట్టు ఉందని, అలాగే రెండు చెవులకు రింగ్స్ ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేస్ నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.


Similar News