నిజామాబాద్కు మాజీ మంత్రి డీఎస్ పార్థివ దేహం తరలింపు
మాజీ మంత్రి డీఎస్ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం నిజామాబాద్కు తరలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ నివాసంలో
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి డీఎస్ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం నిజామాబాద్కు తరలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ నివాసంలో డీఎస్ భౌతికాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం డీఎస్ మృత దేహాన్ని నిజామాబాద్కు తరలిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం కోసం డీఎస్ మృతి దేహాన్ని స్వగ్రామంలో ఉంచి.. రేపు (ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ను ఆదేశించారు. సీఎస్ ఆర్డర్తో అధికారులు డీఎస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్ అంత్యక్రియలకు రేపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, తదితరులు పాల్గొననున్నారు. కాగా, గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న డీఎస్.. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే.