వైకుంఠపాళి ఆటలో పెద్దపాము కేసీఆరే!.. బీఆర్ఎస్ ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్

కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము కేసీఆరేనని టీ కాంగ్రెస్ విమర్శలు చేసింది.

Update: 2024-07-03 13:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము కేసీఆరేనని టీ కాంగ్రెస్ విమర్శలు చేసింది. కేసీఆర్ ముందే చెప్పిండు అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కి తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతుబంధుకు రాంరాం, కరెంట్ కాట గలుస్తదని, కైలాసం వైకుంఠపాలి ఆటలో పెద్దపాము మింగినట్టు అయితది అని వ్యాఖ్యానించారు. దీనిపై కేసీఆర్ ముందే చెప్పిండు! అని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ.. ఇంతకీ.. కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము ఎవరయ్యా అంటే.. కేసీఆర్ అని మాజీ సీఎం ఫోటోను వైకుంఠపాళి ఆటలో పెట్టి వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. దీనిపై ఇందుగలదందు లేదని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే గలదు అయ్యగారి అవినీతి!! అని విమర్శలు చేసింది. అంతేగాక ఇగ ఈయన మాట్లాడతాడు పాముల గురించి, తేళ్ళ గురించి అంటూ.. నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్, అందుకే నీ కోరలు పీకి మూలకి కూసోబెట్టిండ్రు తెలంగాణ పబ్లిక్ అని తెలంగాణ కాంగ్రెస్ రాసుకొచ్చింది.


Similar News