మండలంలో మీరు మిగిల్చిన పనులను పూర్తి చేస్తాను : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఆత్మీయ సన్మాన సభ ను మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో

Update: 2024-07-03 12:43 GMT

దిశ, నర్మెట్ట : ఆత్మీయ సన్మాన సభ ను మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో బుధవారం రోజున నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ గోవర్ధన్ నాయక్,జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి మీతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఐదు ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి క్లుప్తంగా వివరించారు.పదవీ విరమణ తీసుకుంటున్నందుకు బాధగా ఉన్నా ఎల్లవేళలా మీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎన్నికైన ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీ లకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎన్నికై పలు కార్యక్రమాలు చేపట్టి మండలాన్ని అభివృద్ధి బాటలో ఉంచినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

నేను ఎమ్మెల్యే గా గెలవక ముందు ఇచ్చిన ఉచిత వైద్యం హామీని ఎలా నెరవేరుస్తున్నానో, మీ మండలంలో మీరు మిగిల్చిన పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ లను అభినందించి రాజకీయంగా ఎదగాలని దీవించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, వైస్ ఎంపీపీ ఆగిరెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి, పెద్ది రాజిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ మెంబెర్ ఎండీ గౌస్,ఎంపీటీసీ లు కళ్యాణం మురళి, ఎర్పుల చైతన్య,లలిత, యాదమ్మ, లక్ష్మి,మండల కొ ఆప్షన్ మెంబెర్ జోజి రెడ్డి, మండల అధ్యక్షుడు చింతకింది సురేష్,వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు, మండల ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఈజిఎస్, మండల సమాఖ్య సిబ్బంది,ఏపీఎం రవి, రిటైర్డ్ ఎంపీడీఓ ఖాజా మోయినుద్దీన్,బీఆర్ఎస్ గ్రామ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News