రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-09-06 15:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గణేష్ ఉత్సవాలను ఘనంగా చేస్తారని, ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుందని అన్నారు. గణేష్ మండపాల్లో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని, ఉత్సవాలను అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే మండపాల వద్ద రక్షణ చర్యలు కల్పించాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నవరాత్రులు ముగిసేదాక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 


Similar News