ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవం..

ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవాన్ని ఆర్‌బీవీఆర్‌ఆర్ మహిళా కళాశాల్లో బీబీఎం ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.

Update: 2023-09-04 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవాన్ని ఆర్‌బీవీఆర్‌ఆర్ మహిళా కళాశాల్లో బీబీఎం ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కవితా మామ్, ఐఐసి అధ్యక్షురాలు కె. సింధూరి, ఐఐసి వైస్ ప్రెసిడెంట్ విజిత మాలిని మామ్, డాక్టర్ వంశీ మోహన మామ్, కన్వీనర్ నిషా మాధుర్ మామ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు విద్యార్థులను అభినందించారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తలపై పోస్టర్ తయారీ, వ్యాసరచన, PPT తయారీ, వ్యాపార ప్రపంచంలో తమదైన ముద్ర వేయడానికి వ్యవస్థాపకులు ఎలా కష్టపడతారు అనే అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.


Similar News