అక్కడే సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి(Kondareddypally)లో నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించనున్నారు.

Update: 2024-10-12 02:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి(Kondareddypally)లో నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించనున్నారు. దసరా(Dussehra) పండుగ కావడంతో ఆయన స్వగ్రామైన కొండారెడ్డిపల్లిలో వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి వస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం గత నెల రోజుల నుంచి గ్రామంలో ప్రత్యేక రివ్యూ సమావేశాలు, అభివృద్ధిపై సమీక్షలు చేస్తూ అన్ని ఏర్పాట్లను సవ్యంగా చేసేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ పనులు చేపడుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సీఎం కొండారెడ్డిపల్లికి వెళ్తారు. ఇదిలా ఉండగా.. కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి దసరా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


Similar News