పండుగపూట తీవ్ర విషాదం.. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
దసరా పండుగపూట హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి
దిశ, వెబ్డెస్క్: దసరా పండుగపూట హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్(KPHB police station) పరిధిలోని షంషీగూడలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ కలహాలతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నది. విషయం గమనించిన స్థానికులు సుప్రియ తల్లిదండ్రులు, పోలీసులకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భర్త రఘువేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుప్రియ ఆత్మహత్య చేసుకునే సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. రఘువేందర్ రెడ్డి వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని సుప్రియ తల్లిండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.