రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Update: 2024-10-11 14:51 GMT

దిశ, శామీర్ పేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తుర్కపల్లి లోని యూనిక్యూ బయోటెక్ కంపెనీకి చెందిన టీఎస్ 08 యూడీ 4131 నెంబర్ గల (వింగర్ ) వాహనం హైదరాబాద్ నుంచి తుర్కపల్లి లోని కంపెనీకి ఉద్యోగులను తీసుకువస్తుంది. వింగర్ డ్రైవర్ అతివేగంతో అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ తుర్కపల్లి సమీపంలో ముందు భాగంలో కూర్చున్న బేగంపేట కు చెందిన ఎవలిన్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు . మరో ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News