రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన సంఘటన మేడ్చల్

Update: 2024-10-11 16:15 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... దుండిగల్ మండలం బహుదూర్పల్లికి చెందిన నీలగిరి జగన్నాథ్ సాహో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ నుంచి తన ద్విచక్ర వాహనంపై బహదూర్ పల్లి వెళ్తుండగా వీఆర్ఎల్ ఆర్ఎంసీ కంపెనీ వద్ద డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో జగన్నాధ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాల కాపాడలేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Similar News