రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-10-11 16:10 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్లో శుక్రవారం జరిగింది. దాదాపు 35 ఏండ్లు ఉన్న వ్యక్తి డబిల్ పూర్ మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Similar News