విస్కీ ఐస్క్రీం కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్(HYDERABAD) లో కలకలం రేపిన విస్కీ ఐస్క్రీం కేసులో మరో కోణం వెలుగు చూసింది.

Update: 2024-09-06 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(HYDERABAD) లో కలకలం రేపిన విస్కీ ఐస్క్రీం కేసులో మరో కోణం వెలుగు చూసింది. ఐస్క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్నారంటూ జూబ్లీహిల్స్ అరికో ఐస్క్రీం పార్లర్ మీద ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులు వాదన ప్రకారం.. తాము ఐస్క్రీంలో ఎలాంటి మత్తు పదార్థాలు కలపలేదని, పోలీసులు దాడి చేసినప్పటి ఐస్క్రీం ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తే వారికోసం మాత్రమే తయారు చేశామని చెప్పుకొచ్చారు. అయితే నగర వ్యాప్తంగా జోరుగా అమ్మకాలు సాగిస్తున్న ఈ పార్లర్ సోషల్ మీడియా వేదికగా భారీగా ఆర్డర్లు తీసుకొని, డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీకెండ్ పార్టీలకు మత్తుమందు కలిపిన ఐస్క్రీంలు, చాక్లెట్లు భారీగా అమ్మినట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ పార్లర్ ను సీజ్ చేయగా.. నగరంలో ఇంకా ఎక్కడైనా వీరి బ్రాంచీలు ఉన్నాయా.. ఇంకా ఏమైనా మత్తు మందు కలుపుతున్నారా, ఇప్పటి వరకు ఎంతమందికి ఇలా మత్తు మందు కలిపిన పదార్థాలు విక్రయించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News