ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. మొత్తం 24 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ కిరణ్ చౌహాన్ నిర్ధారించారు.
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో జరిగిన భారీ ఎన్కౌంటర్(Encounter)లో మొత్తం 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ కిరణ్ చౌహాన్ నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అబూజ్మడ్ ఫారెస్ట్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మావోయిస్టులు అప్రమత్తం కావడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.