నేను సింహాన్ని.. నటుడు నాగార్జున మరోసారి సంచలన వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)తో వివాదం వేళ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-04 16:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)తో వివాదం వేళ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ‘నేను ఎప్పుడూ బలమైన వ్యక్తిని. తమ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నేను సింహాన్ని. క్లిష్ట సమయంలో మాకు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అండగా నిలబడింది. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వర రావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అని నాగార్జున పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేశారు. త‌న కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్ నేడు విచార‌ణ‌కు రాగా.. నాంప‌ల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Similar News