శాసనసభను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం శుక్రవారం తెలంగాణ శాసనసభ కార్యాలయాన్ని సందర్శించారు.

Update: 2024-10-04 15:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం శుక్రవారం తెలంగాణ శాసనసభ కార్యాలయాన్ని సందర్శించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసన సభ, శాసన మండలి సభ మందిరాలను చూపించి, నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన మంత్రులు రిచర్డ్ రీయర్డాన్ , బ్రాండ్ బట్టిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లేజిస్లేచర్ సభలను గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. లేజిస్లేచర్ కి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ కార్యాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహాచార్యులు ఉన్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందాన్ని సన్మానించారు.


Similar News