పాట్నా : కరోనా వ్యాక్సిన్ తీసుకునే క్రమంలో ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారం కొవిన్ పోర్టల్ నుంచి లీకైందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జరిపిన దర్యాప్తులో బిహార్కు చెందిన ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అతడిని అదుపులోకి తీసుకుంది. ప్రముఖులు, ఉన్నతాధికారులకు సంబంధించిన సమాచారాన్ని ఈ వ్యక్తే టెలిగ్రామ్ బాట్ లో లీక్ చేశాడని అనుమానిస్తున్నారు.
ఈ వివరాలను ఆరోగ్య కార్యకర్తగా ఉన్న తన తల్లి నుంచి యువకుడు సంపాదించినట్లు భావిస్తున్నారు. దీంతో ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో కలిసి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జరిపిన దర్యాప్తులో బిహార్ యువకుడి హ్యాకింగ్ బండారం బట్టబయలైంది.