భార్యపై భర్త హత్యాయత్నం
భార్యను కత్తితో పొడిచి హతమార్చేందుకు ఓ భర్త పన్నాగం పన్నాడు.
దిశ, నిర్మల్ రూరల్ : భార్యను కత్తితో పొడిచి హతమార్చేందుకు ఓ భర్త పన్నాగం పన్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న నవనీతపై ఆమె భర్త గోవిందు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భార్య, భర్తల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.