బెంగుళూరు భవనం కూలిన ఘటన.. యజమాని, కాంట్రాక్టర్ అరెస్ట్

బెంగళూరులోని బాబుసపల్య ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-23 16:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని బాబుసపల్య ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది ఆ భవనం కింద చిక్కుకున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ముగ్గురిని రక్షించగా.. మిగత వారికోసం అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీయగా.. మరింతమంది శిథిలాల కింద మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో భవన యజమానిని, కాంట్రాక్టర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా భవనానికి 4 అంతస్తుల వరకే అనుమతి తీసుకొని, 7 అంతస్తులు నిర్మిస్తున్నట్టు.. అది కూడా సరైన నాణ్యత లేకుండానే నిర్మిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


Similar News