అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్..
తెలంగాణ యాంటీ నార్కొటిక్బ్యూరో, నార్కొ ఎన్ఫోర్స్ మెంట్విభాగం సిబ్బంది
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ యాంటీ నార్కొటిక్బ్యూరో, నార్కొ ఎన్ఫోర్స్ మెంట్విభాగం సిబ్బంది, బంజారాహిల్స్పోలీసులు కలిసి అంతర్జాతీయ డ్రగ్పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తోపాటు అయిదు మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్పోలీస్కమిషనర్సీ.వీ. ఆనంద్శుక్రవారం పోలీస్కమాండ్కంట్రోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన అగ్బోవో మ్యాక్స్వెల్నబుసి 2011లో మెడికల్వీసాపై భారత్వచ్చాడు. మొదట ముంబయికి చేరుకున్న మ్యాక్స్వెల్కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ముంబయిలో డ్రగ్స్అమ్మటం ప్రారంభించిన అగ్బోవో కొన్నాళ్ల తరువాత పోలీసులు పట్టుకుంటారన్న భయంతో బెంగళూరుకు మకాం మార్చాడు.
ఆ తరువాత క్వెకు ఎస్సుమన్క్వామే పేర నైజీరియా దేశం నుంచి జారీ అయినట్టుగా నకిలీ పాస్పోర్ట్, వీసా తయారు చేసుకున్నాడు. వీటిని సమర్పించటం ద్వారా బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దాంతోపాటు ఇంటర్నెట్కనెక్షన్ను కూడా సమకూర్చుకున్నాడు. ఆ తరువాత నైజీరియాకే చెందిన మజీతో కలిసి బెంగళూరులో కూడా డ్రగ్స్దందా మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కాలేజీలు, యూనివర్సిటీలకు దగ్గరగా ఉన్న అచ్యుతాపురానికి మకాం మార్చి విద్యార్థినీ, విద్యార్థులకు డ్రగ్స్అమ్మటం ప్రారంభించాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి వర్చువల్ఫోన్నెంబర్లను ఉపయోగించేవాడు.
స్నేహితుడైన మజీ పేరును ఎవ్లిన్యోరెంకియావాగా మార్చి నేషనల్బ్యాంక్లో అకౌంట్కూడా తెరిపించాడు. వీరి దందా కొనసాగుతుండగానే నైజీరియా నుంచి స్టూడెంట్, బిజినెస్వీసాల మీద బెంగళూరుకు వచ్చిన ఒకెకె చిగొజీ బ్లెస్సింగ్, ఐకెమ్ఆస్టిన్ఒబాకాతో అగ్బోవోకు పరిచయం ఏర్పడింది. కమీషన్ఆశ చూపించిన అగ్బోవో చిగొజీ, ఆస్టిన్లను కూడా డ్రగ్స్దందాలోకి దింపాడు.
సడన్ డెలివరీ..
డార్క్నెట్లో నేషనల్బ్యాంక్లో ప్రారంభించిన అకౌంట్వివరాలను అప్లోడ్చేసిన అగ్బోవో ఆన్ లైన్ద్వారానే డ్రగ్స్విక్రయాలు జరిపేవాడు. బ్యాంక్ఖాతాలో ఎవరైనా డబ్బు జమ చేయగానే ఫలానా చోట మీకు కావాల్సిన సరుకు ప్యాకెట్ఉంటుందని మెయిల్పంపించేవాడు. చెప్పిన రోజున, చెప్పిన సమయానికి డ్రగ్స్తో ఉన్న కవర్పెట్టి వెళ్లేవాడు. కొన్నిసార్లు తాను డ్రగ్స్పెట్టిన చోటు లొకేషన్షేర్చేసేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్శ్రీనగర్కాలనీకి చెందిన సాయి అకేశ్, మణికొండ అలకాపురి వాస్తవ్యుడు తుమ్మ భానుతేజ రెడ్డి, కేరళ రాష్ర్టం త్రిస్సూర్నివాసి సంజయ్సునల్కుమార్ తో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి.
అగ్బోవో నుంచి డ్రగ్స్కొంటున్న సంజయ్సునీల్కుమార్, భానుతేజ రెడ్డిలను కొంతకాలం క్రితం అరెస్టు చేసిన బంజారాహిల్స్పోలీసులు వారిని విచారించి మొత్తం గ్యాంగ్వివరాలు సేకరించారు. అనంతరం యాంటీ నార్కొటిక్బ్యూరో, నార్కొటిక్ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలకు చెందిన అధికారులు రంగంలోకి దిగి మజీ మినహా మిగితా నిందితులందరినీ అరెస్టు చేశారు. అరెస్టయిన నైజీరియన్లను వారి దేశానికి డిపోట్చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ఆనంద్తెలిపారు.