CM Chandrababu:‘త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. వారికే ప్రాధాన్యం’

ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-22 15:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం(Government) అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల(Nominated posts) భర్తీ పై సీఎం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ(TDP) పార్టీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలు చిరస్మరణీయం అని కొనియాడారు. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. 


Similar News