అమానుషం: ముగ్గురు మహిళలపై వార్డు నెంబర్ దౌర్జన్యం

ఏలూరు జిల్లా‌‌ నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో అమానుష ఘటన జరిగింది.

Update: 2023-10-30 12:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా‌‌ నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో అమానుష ఘటన జరిగింది. ఓ వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. మానవత్వం మరిచిపోయి ముగ్గురు మహిళపట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే వార్డు మెంబర్ ఆంజనేయులుకు స్థలం ఉంది. ఆ స్థలంలో సమీపంలో ఉండే వారు గొర్రెలు మేపారు. తన స్థలంలో గడ్డిని గొర్రెలు తిన్నాయనే కారణంతో గొర్రెల కాపరిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడి భార్య అడ్డుకుంది. అయినప్పటికీ వినకుండా దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ దంపతుల ఇద్దరు అమ్మాయిలు కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వార్డు మెంబర్ కోపోద్రిక్తుడై వారిపైనా దాడికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు మహిళలపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ స్థలం మీది కాదని సచివాలయం స్థలంలో గొర్రెలు తిన్నాయి అని చెప్పినా వినిపించుకోకుండా అత్యంత దారుణంగా అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు మహిళలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Similar News