AP News: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం - విజయవాడ (Vizag - Vijayawada Flights) మధ్య మరో రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.

Update: 2024-10-27 03:32 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం - విజయవాడ (Vizag - Vijayawada Flights) మధ్య మరో రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయల్దేరి.. 10.35 గంటలకు విజయవాడ దగ్గర్లోని గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)కు చేరుతుంది. ఇది తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 9 గంటలకు విశాఖకు చేరుతుంది.

అలాగే ఇండిగో సర్వీస్ (Indigo Flight) విజయవాడలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై.. 8.20 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయల్దేరి 9.50 గంటలకు విజయవాడకు చేరుతుంది. ఈ కొత్త విమానాలతో విశాఖ - విజయవాడ నగరాల మధ్య తిరిగే విమానాల సంఖ్య 3కి చేరింది. ఈ విమాన సర్వీసులతో విశాఖ - విజయవాడ ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. 

Tags:    

Similar News