ఏపీలో రెండోసారి కేంద్ర బృందం పర్యటన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలలో వరదలు బీభత్సం సృష్టించాయి.

Update: 2024-09-11 14:45 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వచ్చిన వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి మరోసారి కేంద్ర బృందం వచ్చింది. ఇందులో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం నష్టంపై వివరాలు సేకరించింది. కాగా వారం రోజుల వ్యవధిలో కేంద్ర బృందం రెండోసారి ఏపీలో పర్యటించింది. మొదట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించిన విషయం తెలిసిందే. నేడు రెండో సారి కృష్ణా, బాపట్ల జిల్లాలో కేంద్ర బృందాలు పర్యటించాయి. వివిధ అధికారులతో భేటీ అయిన కేంద్ర అధికారులు భారీ వరద కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.


Similar News