చంద్రబాబుకు బిగ్ షాక్: మరో కేసు నమోదు చేసిన సీఐడీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.

Update: 2023-10-30 13:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస కేసులతో చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారు.తాజాగా చంద్రబాబు నాయుడుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు 50 రోజులుగా రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసు విచారణ కొనసాగుతుండగానే సీఐడీ మరో షాక్‌ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా సీఐడీ చేర్చింది. అనంతరం ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చింది సీఐడీ. ఈ కేసులతోపాటు అంగళ్లు దాడి కేసు, విజయనగరంలో కేసు, ఇలా వరుస కేసులు చంద్రబాబు నాయుడును ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీ పీటీ వారెంట్ సైతం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News