Big News: సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుండగా..

విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.

Update: 2024-09-02 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పట్టణంలో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన బోటు మార్గమధ్యలో ఒక్కసారిగా ఓ వైపునకు పూర్తిగా ఒరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే తేరుకున్న సిబ్బంది బోటును తిరిగి యథాస్థితిలోకి తీసుకొచ్చారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్న అధికారులు వ్యక్తిగత సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.  


Similar News