భర్తను కడతేర్చిన అక్రమ సంబంధం

అక్రమ సంబంధంతో అమాయక భర్త ప్రాణాలు తీసిన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని బిచ్చల్ గ్రామంలో ఈనెల 12వ తేదీన చోటు చేసుకుంది.

Update: 2024-06-29 15:59 GMT

దిశ, దౌల్తాబాద్: అక్రమ సంబంధంతో అమాయక భర్త ప్రాణాలు తీసిన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని బిచ్చల్ గ్రామంలో ఈనెల 12వ తేదీన చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసిన కేసు విషయంలో శనివారం ఇరువురిని కోర్టుకు పంపిస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై రవి గౌడ్ తెలిపారు. బిచ్చల గ్రామానికి చెందిన 1. కొరిడె రేణుక భర్త అశోక్ వయసు 36 సంవత్సరాలు,2. బదిగే అనిల్ తండ్రి చంద్రప్ప వయస్సు 27 సంవత్సరాలు ఆరు నెలల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది. రేణుక తన భర్త కొరిడె అశోక్, హైదరాబాద్ లో పాప్ కార్న్ అమ్ముకొని వచ్చిన డబ్బులతో తన భార్య పిల్లలను పోషించేవాడు.

ఐదు నెలల నుంచి అశోక్ హైదరాబాద్ నుంచి తన ఇంటికి వచ్చి అప్పటినుండి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రేణుక,అనిల్ అశోక్ ను అంతమొందిస్తే తమకు అడ్డు ఎవరూ ఉండరు అని భావించారు. ఈ నెల 12వ తేదీన రాత్రి అశోక్ తన ఇంట్లో పడుకుని ఉండగా మధ్య రాత్రి సమయంలో రేణుక, అనిల్ ఇద్దరు కలిసి అశోక్ గొంతు నులిమి చంపారు. ఎవరికి అనుమానం రాకుండా అశోక్ ఎక్కువగా మద్యం సేవించి చనిపోయాడు అని అందరిని నమ్మించారు.

ఈ నెల 13-వ తేదీన అందరి సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తర్వాత అశోక్ అన్న కొరిడె నరసింహులు కు తన తమ్ముడి చావు పై అనుమానం కలిగి తేదీ 18-6- 2024 నాడు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా కొరిడె రేణుక, బదిగే అనిల్ ఇద్దరు వారి అక్రమ సంబంధం విషయంలో అడ్డు తొలగించుకోవడానికి అశోక్ ను చంపారని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిపై మర్డర్ కేసు నమోదు చేసి శనివారం రోజు కోర్టుకు పంపడం జరిగిందని స్థానిక ఎస్సై రవి గౌడ్ తెలిపారు.

Similar News