అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కలుపు (గడ్డి) మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Update: 2024-07-01 10:07 GMT

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కలుపు (గడ్డి) మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిన ఎస్సై తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్థానికంగా రాత్రి వరకు ఎస్సై ఎక్కడికి వెళ్లారు అనేది తెలియలేదు.

అయితే మధ్యాహ్నం మహబూబాబాద్ లో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సహచర సిబ్బందితో ఉన్న విభేదాలు.. గతంలో నుంచి ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. 2014 బ్యాచ్ కు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ అశ్వారావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Similar News