లారీ,స్కూటర్ ఢీ.. యువకుడు మృతి

ట్యాంకర్ లారీ, స్కూటర్ ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడు

Update: 2024-07-01 11:16 GMT

దిశ,మెదక్ ప్రతినిధి : ట్యాంకర్ లారీ, స్కూటర్ ఢీ కొట్టిన ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ మండలం మాచవరం గేట్ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. టేక్మాల్ మండలం వేల్పుగొండ కు చెందిన ప్రేమ్ కుమార్(22) స్కుటి పై వస్తుండగా మాచవరం గేట్ సమీపంలో ట్యాంకర్ లారీ నీ ఢీ కొట్టింది. లారీ యువకుడి తలపై వెళ్ళడం తో తల నుజ్జునుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న తల్లి కి స్వల్ప గాయాలయ్యాయి. తల్లి కొడుకులు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటి ముందు కన్న కొడుకు మృతి చూసిన తల్లి బోరున విలపించింది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News