30 కిలోల గంజాయి పట్టివేత.. ఆటో సీజ్.. ముగ్గురు అరెస్ట్

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు

Update: 2024-07-01 14:16 GMT

దిశ,పటాన్ చెరు : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రామచంద్రపురం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని, ఒక ఆటో ను తనిఖీ చేయగా ఆటో లో 30 కేజీల గంజాయి పట్టు పడింది. ఆటో నడుపుతున్న ఇస్మాయిల్(30) ను పట్టుకుని విచారించగా స్కూటీ పై వెళ్తున్న అసిఫ్ నగర్ కు చెందిన ఖాసీం(39),షకీర్ (22) లతో కలిసి పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు గంజాయిని విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. అక్రమంగా గంజాయి ని తరలిస్తున్న ముగ్గురు నింధితులను అదుపులో తీసుకోవడంతోపాటు స్కూటీ, ఆటో తో పాటు మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు రామచంద్రపురం ఇన్స్పెక్టర్ జగన్నాథ్ వెల్లడించారు.

Similar News