బంగారం షాపులో చోరీకి పాల్పడిన మహిళలు అరెస్ట్

బంగారం షాపులో చోరీకి పాల్పడిన మహిళలను పోలీసులు

Update: 2024-07-03 16:04 GMT

దిశ, పాలకుర్తి/తొర్రూరు: బంగారం షాపులో చోరీకి పాల్పడిన మహిళలను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని రజినీకర్ జ్యువెలరీ వర్క్స్ ,బాపూజీ జ్యువెలరీ షాపులలో ఆభరణాలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన భూక్యా బుజ్జి,భూక్య కైలా, గుగులోత్ మీరా భూక్య అమ్ము అను మహిళలు బంగారు షాప్ లో రెండు జతల కాళ్ల పట్టీలు, నాలుగు చేతి బ్రాస్లెట్ దొంగిలించారని సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు షాపు యజమానుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో మహిళలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసును 24 గంటలు తిరగకముందే ఛేదించిన పాలకుర్తి పోలీసులను అభినందనలు తెలిపారు.


Similar News