ఐదుగురిపై వరకట్న వేధింపు కేసు
అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్తో పాటు మరో నలుగురిపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది.
దిశ, కారేపల్లి : అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్తో పాటు మరో నలుగురిపై కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం కారేపల్లి మండలం ఫైల్తండాకు చెందిన సౌందర్యకు ఫారెస్టు బీట్ ఆఫీసర్గా పని చేస్తున్న ఏన్కూర్ మండల ఎర్రబోడు గ్రామానికి చెందిన భూక్యా మల్సూర్ తో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది.
వీరికి ఇద్దరు పిల్లలు. సౌందర్యను అదనపు కట్నం కోసం కొంత కాలంగా భర్త మల్సూర్తో పాటు అత్తమామలు, అడపడుచు, మరొకరితో కలిసి మానసికంగా, శరీరకంగా వేధిస్తున్నారు. దీనిని తట్టుకోలేక బాధితురాలు శుక్రవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.