మహిళలపై నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత విగ్రహం వైరల్.. ఎక్కడంటే?

దేశంలో మహిళలు, బాలికలపై లైంగికదాడులు(sexual assaults) ఆగడం లేదు. ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు ఆపై హత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2024-10-04 12:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో మహిళలు, బాలికలపై లైంగికదాడులు(sexual assaults) ఆగడం లేదు. ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు ఆపై హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మహిళను యాభై ముక్కలు చేసి ఫ్రీజ్‌లో పెట్టిన దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఇక ట్రైనీ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో దసరా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తుంది. జీవచ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్లు, సింహం సిగ్గుతో తల దించుకున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘అవమానం’ ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Similar News