BREAKING: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలోని రామాపురంలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలోని రామాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదుగురు యువకులు కలిసి కారులో వెళ్తుండగా రామాపురం వద్ద రాగానే ఎదరుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో కడప జిల్లాలకు చెందిన అంజి నాయక్ (29), షేక్ అలీమ్ (౩2), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్గా పోలీసులు గుర్తించారు.