BREAKING: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల పరిధిలోని చారితండ స్టేజీ వద్ద చోటుచేసుకుంది.

Update: 2024-07-06 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల పరిధిలోని చారితండ స్టేజీ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం వైపు నుంచి వస్తున్న నెక్సన్ కారు తొర్రూర్ బీరిశెట్టిగూడెం గ్రామానికి వెళ్తున్న ప్రయాణికుల ఆటోను అదుపు చేయలేని స్థితిలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పగిండ్ల కొమురయ్య (40) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మంజుల, కూతురు అంజలి తీవ్ర గాయలతో ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. వారితో తొర్రూర్ మండలము వెలికట్టే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బంధు మల్లేశం (40), దంతాలపల్లి మండలము వాల్యా తండాకు చెందిన భూక్యా నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ప్రయాణికురాలు అక్కెనపల్లి అక్షయ‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాధ్ కేకన్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News