ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలి జిల్లా దుండాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-07-01 13:21 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలి జిల్లా దుండాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ, కారు ఒకదానితో మరొకటి బలంగా ఢీకొట్టాయి. దీంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


Similar News