లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమైన కేంద్రమంత్రి రమ్మోహన్ నాయుడు
భారత పౌర విమానయాన శాఖ మంత్రి రమ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు.
దిశ, వెబ్డెస్క్: భారత పౌర విమానయాన శాఖ మంత్రి రమ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోట గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంపై ఇరువురు నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. విమానాశ్రయంపై మంత్రిత్వ శాఖ సీరియస్గా ఉందని, వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేయాలని, ఎన్ఓసీ, ఇతర లాంఛనాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లలో ఎయిర్పోర్టును ప్రారంభించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పీకర్ కు తెలిపారు.