దుబాయ్ ఇంజ‌నీర్ దారుణ హత్య…గొంతు కోసి పారిపోయిన దుండగులు

అనుమాన‌స్ప‌ద స్థితిలో ఓ ఇంజ‌నీర్ మృతి చెందిన సంఘ‌ట‌న నార్సింగి పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-06-29 10:11 GMT

దిశ‌, గండిపేట్ : అనుమాన‌స్ప‌ద స్థితిలో ఓ ఇంజ‌నీర్ మృతి చెందిన సంఘ‌ట‌న నార్సింగి పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్ట‌ర్ హ‌రికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నార్సింగి ప‌రిధిలోని మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్ వెంచ‌ర్ ఓపెన్ ప్లాట్‌లో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ప‌డి ఉంద‌ని శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌మాచారం అందిందని తెలిపారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతుని వివ‌రాలు సేకరించారు. మృతున్ని ప‌రిశీలించ‌గా అతడి గొంతు కోసి హ‌త్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు గోల్కొండ‌లోని చోటా బ‌జార్ ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. సౌదీలో ఇంజ‌నీర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా నిందితులు, మృతుని కారులోనే వ‌చ్చిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Similar News